Kishan Reddy: రైల్వే శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
Kishan Reddy: మహబూబ్నగర్, షాద్నగర్ స్టేషన్లలో రైళ్ల స్టాప్ కోసం విజ్ఞప్తి
Kishan Reddy: రైల్వే శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రైల్వేశాఖమంత్రికి లేఖ రాశారు. మహబూబ్ నగర్, షాద్ నగర్ స్టేషన్లలో రైళ్ల స్టాప్ కోసం ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రైల్వేశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పనను వివరిస్తూ అశ్విని వైష్ణవ్కు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. యశ్వంత్ పూర్ - హజరత్ నిజాముద్దీన్ రైలు, సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలును మహబూబ్ నగర్ రైల్వేస్టేషన్లో స్టాప్ ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో కోరారు. అలాగే చెంగల్ పట్టు -కాచీగూడ ఎక్స్ప్రెస్ షాద్ నగర్ రైల్వే స్టేషన్లో స్టాప్ ఏర్పాటు చేయాలని విన్నవించారు.