Hyderabad Metro: ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

Hyderabad Metro: చివరి రైళ్లు 12.15 గంటలకు బయలు దేరతాయని మెట్రో సంస్థ ప్రకటన

Update: 2024-03-27 09:14 GMT

Hyderabad Metro: ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

Hyderabad Metro: నేడు నగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో ముంబయి-హైదరాబాద్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైళ్ల వేళలు పొడిగించారు. రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయని హైదరాబాద్‌ మెట్రో సంస్థ తెలిపింది. చివరి రైళ్లు రాత్రి 12.15 గంటలకు బయలుదేరతాయని.. 1.10కి గమ్యస్థానాలకు చేరుకుంటాయని చెప్పారు.

Tags:    

Similar News