Telangana: కరోనాను జయించిన సీఎం కేసీఆర్

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనాను జయించారు. ఇవాళ నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది.

Update: 2021-05-05 08:25 GMT

Telangana: కరోనాను జయించిన సీఎం కేసీఆర్

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనాను జయించారు. ఇవాళ నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో కరోనా బారి నుంచి సీఎం కేసీఆర్ బయటపడినట్టు వైద్యులు తెలిపారు. సీఎం సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఆర్టీపీసీఆర్ తో పాటు రక్తపరీక్షల్లోనూ నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అన్ని రక్త పరీక్షల రిపోర్టులు కూడా సాధారనంగా ఉన్నాయని తేలింది. దాంతో సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు వైద్యులు నిర్దారించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకున్నారు. ఆయనకు ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్యుల బృందం కొవిడ్ చికిత్స చేసింది.

Tags:    

Similar News