టీఆర్ఎస్, ఎంఐఎం కూటమికి బుద్ది చెబుతాం : లక్ష్మణ్
టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఈ మున్సిపల్ ఎన్నికల్లో
టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఈ మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి కుటుంబ పాలనకు బుద్ది చెప్పాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మళ్లీ ఓటు ఎందుకు వేయాలనే నినాదంతో బీజేపీ ముందుకు వెళుతోందని చెప్పారు. ఈసారి ఒంటరిగా మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో బరిలో దిగామని టీఆర్ఎస్ ఎంఐఎం కూటమికి బుద్ది చెబుతామన్నారు. గతంలో కాంగ్రెస్ ఎంఐఎంను ప్రోత్సహించి చేతులు కాల్చుకుందని టీఆర్ఎస్ కు అదే పరిస్థితి వస్తుందని లక్ష్మణ్ అన్నారు.