హిందూ జాతిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో వివాదాస్పద నేతగా ముద్రపడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.
తెలంగాణలో వివాదాస్పద నేతగా ముద్రపడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. హిందువుల సంతతి పెరగకుండా విదేశాలు, ఇతర మతస్థులు... ఫుడ్ ప్రొడక్ట్స్లో కెమికల్స్ కలుపుతున్నారంటూ చేసిన ఆరోపణలు హాట్టాపిక్గా మారాయి.
హిందూ సంతతి పెరగకుండా ఇతర మతస్థులు, విదేశీయులు... ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలు కలుపుతున్నారంటూ రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ ఫుడ్ ప్రొడక్ట్స్ తినడం వల్లే హిందువుల్లో చాలా మందికి పిల్లలు పుట్టడం లేదన్న రాజాసింగ్ కామెంట్స్... తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇండియాలో హిందువనే వాడే లేకుండా, మొత్తం హిందూ జాతిని నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని హెచ్చరించారు.
ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి అవుతోన్న ఆహార ఉత్పత్తులపై రాజాసింగ్ అనుమానాలు వ్యక్తం చేయడం హాట్ టాపిక్గా మారింది. జంక్ ఫుడ్స్ కారణంగా సంతానలేమి సమస్య ఏర్పడుతోందన్నారు. జంక్ ఫుడ్స్ కారణంగా సంతానలేమి సమస్య ఏర్పడుతోందంటూ వైద్యులు సైతం హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే విషయంపై డాక్టర్లు ఏమంటున్నారో ఓసారి చూద్దాం.