Manikonda: పైప్లైన్ బ్లాస్ట్.. మణికొండలో కాలనీలను ముంచెత్తిన వరద
Manikonda: హైదరాబాద్ మణికొండలో కాలనీలను వరద ముంచెత్తింది. మణికొండలో భారీ పైప్లైన్ పగిలి కాలనీల్లోకి వరద వచ్చింది.
Manikonda: హైదరాబాద్ మణికొండలో కాలనీలను వరద ముంచెత్తింది. మణికొండలో భారీ పైప్లైన్ పగిలి కాలనీల్లోకి వరద వచ్చింది. సింగూరు నుంచి హైదరాబాద్కు తాగునీటిని తీసుకువచ్చే పైప్ లైన్ తెల్లవారుజామున పగిలిపోయింది. దీంతో అపార్ట్మెంట్ సెల్లార్లు వరద నీటితో నిండిపోయాయి. వాహనాలు నీటిలో మునిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది, మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో రోడ్డు మొత్తం ధ్వంసం అయి రాకపోకలకు ఇబ్బందిగా మారింది.