Mulugu: జంపన్న వాగు ఉగ్రరూపం.. ఏడుగురు గల్లంతు.. ముగ్గురు మృతదేహాలు లభ్యం..
Mulugu: మరో నలుగురి కోసం కొనసాగుతోన్న గాలింపు
Mulugu: జంపన్న వాగు ఉగ్రరూపం.. ఏడుగురు గల్లంతు.. ముగ్గురు మృతదేహాలు లభ్యం..
Mulugu: ములుగు జిల్లాలో జంపన్నవాగు ఉధృతంగా మారింది. ఏటూరు నాగారం మండలం కొండాయి, మాల్యాల గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో వందలాది మంది గ్రామంలోనే చిక్కుకునిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే వరద ఉధృతి కారణంగా గ్రామంలోకి వెళ్లలేకపోతున్నామని చెబుతున్నాయి NDRF బృందాలు. ఇక నిన్న జంపన్న వాగులో గల్లంతైన ఏడుగురు గల్లంతవగా... అందులో ముగ్గురు మరణించారు. మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోంది.