Revanth Reddy: రైతు భరోసాపై కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy: ఈ నెల 9లోపు రైతు భరోసా నిధులు ఇస్తాం

Update: 2024-05-04 08:20 GMT

Revanth Reddy: రైతు భరోసాపై కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy: రైతు భరోసాపై చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్‌కి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 9 లోపు రైతులందరికీ రైతు భరోసా నిధులు ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అన్నదాతలకు డబ్బులు ఇవ్వకుంటే అమరవీరుల స్థూపం సాక్షిగా ముక్కు నేలకు రాస్తానని.... లేకుంటే మీరు అదే పని చేస్తారా అని కేసీఆర్‌ని నిలదీశారు. రుణమాఫీ సైతం ఆగస్టు 15 లోపు చేసి.... రైతుల రుణం తీర్చుకుంటామన్నారు. రాష్ట్రాన్ని దివాళా తీయించి రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News