Ponnam Prabhakar: ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన బండి సంజయ్కి.. ఇప్పుడు రైతులు గుర్తుకు వచ్చారా..?
Ponnam Prabhakar: ఢిల్లీ వెళ్లి మోడీ దగ్గర రైతుల కోసం దీక్ష చేయాలి
Ponnam Prabhakar: ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన బండి సంజయ్కి.. ఇప్పుడు రైతులు గుర్తుకు వచ్చారా..?
Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న 314వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన బండి సంజయ్.. ఎప్పుడూ ప్రజా సమస్యల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో దీక్ష చేసే బదులు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ దగ్గర దీక్ష చేయాలని సూచించారు. వర్షాకాలలో సరిపడా వర్షాలు పడక..గ్రౌండ్ లెవల్ వాటర్ తగ్గిపోతే... కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందనడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర దీక్ష చేయాలని డిమాండ్ చేశారు.