Tamilisai Soundararajan: ప్రజాకవి కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభించిన తమిళిసై

Tamilisai Soundararajan: తెలంగాణలో ప్రజా పాలన ప్రారంభమైంది

Update: 2023-12-15 06:26 GMT

Tamilisai Soundararajan: ప్రజాకవి కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభించిన తమిళిసై

Tamilisai Soundararajan: తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల్లో గెలిచిన సభ్యులకు గవర్నర్‌ అభినందనలు చెప్పారు. ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రసంగం సందర్భంగా పలు కీలక అంశాలపై మాట్లాడిన ఆమె.. తెలంగాణ కవి దాశరథి రచించిన ఆ చల్లని సముద్ర గర్భం కవితతో తన ప్రసంగాన్ని ముగించారు గవర్నర్ తమిళిసై.

Tags:    

Similar News