Neelam Madhu: దీపాదాస్‌ మున్షీని కలిసిన నీలంమధు ముదిరాజ్

Neelam Madhu: మెదక్ పార్లమెంట్ సీటు బీసీలకు ఇచ్చే యోచనలో హస్తం పార్టీ

Update: 2024-03-03 13:45 GMT

Neelam Madhu: దీపాదాస్‌ మున్షీని కలిసిన నీలంమధు ముదిరాజ్

Neelam Madhu: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపా దాస్ మున్షీని, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో మున్షి నివాసానికి వెళ్లిన నీలం మధు.., ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. మెదక్ పార్లమెంట్‌ సీటు బీసీలకు ఇచ్చే యోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని నీలం మధుకు ఆమె సూచించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కంకణబద్ధుడినై పని చేస్తానని...మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని నీలం మధు స్పష్టం చేశారు.

Tags:    

Similar News