Telangana: తెలంగాణ భవన్‌లో సరికొత్త ఫ్లెక్సీలు.. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ ఫ్లెక్సీలు

Telangana: అసెంబ్లీ కార్యాలయాల్లో పేరు మారుస్తూ బోర్డులు

Update: 2022-12-24 08:29 GMT

Telangana: తెలంగాణ భవన్‌లో సరికొత్త ఫ్లెక్సీలు.. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ ఫ్లెక్సీలు

Telangana: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. టిఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ శాసనసభ పక్షంగా గుర్తిస్తూ ఇప్పటికే బుల్లెటిన్ విడుదల చేసారు అసెంబ్లీ కార్యదర్శి. అందుకు అనుగుణంగా అసెంబ్లీ కార్యాలయాల్లో పేరు మార్పు చేస్తూ బోర్డులు పెట్టారు. ఇప్పటికే తెలంగాణ భవన్ లో కూడా అందుకు అనుగుణంగా సరికొత్త ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్లమెంటులో కూడా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా గుర్తించాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు రాజ్యసభ ఛైర్మన్, ఎంపీలు విజ్ఞప్తులు అందజేసారు.

Tags:    

Similar News