హైదరాబాద్ ఫిల్మ్నగర్లో విషాదం.. నాలుగేళ్ల కుమారుడికి ఉరివేసి తల్లి ఆత్మహత్య
Hyderabad: అత్తింటి వేధింపులే కారణమని పోలీసుల అనుమానం
హైదరాబాద్ ఫిల్మ్నగర్లో విషాదం.. నాలుగేళ్ల కుమారుడికి ఉరివేసి తల్లి ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్ ఫిల్మ్నగర్లో విషాదం చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వినాయకనగర్లో విశ్వనాథ్, శిరీష దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండున్నర ఏళ్ల బాలుడు మనీష్. అయితే అత్తింటి వేధింపులు భరించలేక కుమారుడు మనీష్కు ఉరి వేసిన వివాహిత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.