Minister Thummala: నకిలీ విత్తనాల వల్ల రైతులకు నష్టం జరిగితే.. విత్తన కంపెనీలు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి

Minister Thummala: రాష్ట్రంలో నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి

Update: 2023-12-19 09:16 GMT

Minister Thummala: నకిలీ విత్తనాల వల్ల రైతులకు నష్టం జరిగితే.. విత్తన కంపెనీలు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి

Minister Thummala: విత్తనాల సరఫరా, అభివృద్ధిపై మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, విత్తనాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చే సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాల వల్ల రైతులకు నష్టం జరిగితే విత్తన కంపెనీలు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News