TSRTC: 80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
TSRTC: 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని, 20 లహరి బస్సులు
TSRTC: 80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
TSRTC: టీఎస్ఆర్టీసీలో కొత్త బస్సులు రోడ్డెక్కాయి. ఎన్టీఆర్ మార్గ్ వద్ద కొత్త బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల రద్దీ పెరగడంతో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుతున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త బస్సులను కొనుగోలు చేశామని తెలిపారు. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభస్తామన్న ఆయన..ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాని తెలిపారు.