తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా -2021 సదస్సును బేగంపేట ఐటీసీ కాకతీయలో రాష్ర్ట పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ హబ్గా మారిందన్నారు. ఫార్మారంగంలో హైదరాబాద్కు తిరుగులేదన్న కేటీఆర్ పెట్టుబడులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఫార్మా రంగ ప్రతినిధులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు వర్చువల్ విధానంలో ఈ సదస్సు జరగనుంది.