Jagadish Reddy: రేవంత్‌ పిండం వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌ రెడ్డి కౌంటర్‌

Jagadish Reddy: రేవంత్‌ పిండం వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌ రెడ్డి కౌంటర్‌

Update: 2023-08-09 11:57 GMT

Jagadish Reddy: రేవంత్‌ పిండం వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌ రెడ్డి కౌంటర్‌

Jagadish Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి జగదీష్‌ రెడ్డి ఫైరయ్యారు. బీఆర్‌ఎస్‌ పాలనకు పిండం పెడతామంటూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు. రాజకీయ కక్షలతో కేసీఆర్‌ ఏనాడు వ్యవహరించలేదని తెలిపారు. పిండాలు పెట్టి ప్రజలు హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదేనని ఆరోపించారు. రేవంత్‌ ప్రజలకు పిండాలు పెట్టిన టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన వాడే కాబట్టి.. పిండాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌ లాంటి సంస్కార హీనున్ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి శాశ్వత శత్రువులు లేరని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News