Jagadish Reddy: దేశ ప్రజలంతా కేసీఆర్‌ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు..

Jagadish Reddy: ఫ్లోరైడ్‌తో విలవిల్లాడుతున్న నల్గొండ జిల్లాలో అరవయ్యేళ్ల సమస్యను ఆరేళ్లలో పరిష్కరించిన కేసీఆర్ జనంగుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

Update: 2022-09-20 11:30 GMT

Jagadish Reddy: దేశ ప్రజలంతా కేసీఆర్‌ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు..

Jagadish Reddy: ఫ్లోరైడ్‌తో విలవిల్లాడుతున్న నల్గొండ జిల్లాలో అరవయ్యేళ్ల సమస్యను ఆరేళ్లలో పరిష్కరించిన కేసీఆర్ జనంగుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, వనభోజన కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత అన్ని వర్గాలవారు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని మంత్ర జగదీశ్‌ రెడ్డి ప్రస్తావించారు. కొత్త రాజకీయ పార్టీలు వచ్చిపోతుంటాయని, టీఆర్ఎస్ మాత్రం ప్రజలగుండెల్లో నిలిచిపోయిందన్నారు. దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వం వైపే చూస్తున్నారని, ఇలాంటి నాయకుడే తమకు కావాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ వస్తేనే తెలంగాణలోని పథకాలు తమ రాష్ట్రాల్లో అమలవుతాయని ఆశ పడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News