KTR: అదానీకి ఆస్తులు కట్టబెట్టడమే మోడీ పని
KTR: గుజరాత్కు ఓ నీతి.. తెలంగాణకు మరో నీతా
KTR: అదానీకి ఆస్తులు కట్టబెట్టడమే మోడీ పని
KTR: రామగుండంలో సభలో ప్రధాని మోడీ పర్యటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ప్రధాని మోడీ చేసిందేమి లేదని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీ ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ఒక్కొక్కటి అమ్మేస్తున్నారని ఆయన అన్నారు. సింగరేణి గనులను మోడీ ప్రైవేట్కు అప్పగించారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మోడీ గుజరాత్కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ అంటే నమ్మకం..మోడీ అంటే అమ్మకం అని మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.