Kishan Reddy: రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులకుప్పగా మార్చారు
Kishan Reddy: నీతి ఆయోగ్ భేటీ కంటే ముఖ్యమైన పని సీఎం కేసీఆర్కు ఏముంది..?
Kishan Reddy: సీఎం కేసీఆర్ టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోవడం దురదృష్టకరమన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్ కంటే ఇంపార్టెంట్ పని ఏముందని ప్రశ్నించారాయన. రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి కార్యక్రమం అప్పులతోనే చేస్తున్నారని.. అసలు ఎక్కడెక్కడ ఎన్ని అప్పులు తీసుకున్నారు..? ఎన్ని కట్టారు..? ఇంకా ఎన్ని కట్టాల్సి ఉంది..? వీటిన్నింటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.