నేడు కరీంనగర్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం
KCR: సాయంత్రం 6 గంటలకు రోడ్షో, కార్నర్ మీటింగ్
KCR: గులాబీ బాస్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో వేగం పెంచారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల వాగ్బాణాలు సంధిస్తూ.. గులాబీ శ్రేణులను ఉత్తేజ పరుస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... వంద రోజుల్లోనే రాష్ట్రాన్ని రేవంత్రెడ్డి నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా.. ఇవాళ కరీంనగర్లో కేసీఆర్ పర్యటిస్తారు. సాయంత్రం 6 గంటలకు రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు.