హాజీపూర్ వరుస హత్యలపై సోమవారం తుది తీర్పు

- తీర్పు వెల్లడించనున్న నల్గొండ ప్రత్యేక ఫోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు - 101 మంది సాక్షులను విచారించిన కోర్టు

Update: 2020-01-26 16:27 GMT

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యలపై సోమవారం తుది తీర్పు రానుంది. హాజీపూర్‌లో బాలికలు దారుణంగా అత్యాచారం, హత్యలపై నల్గొండలోని ప్రత్యేక ఫోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుల్లో హాజీపూర్‌ నిందితుడు వరంగల్‌ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అక్టోబర్ 14 నుంచి హాజీపూర్ కేసులపై విచారణ జరుగుతుంది. ఈ కేసుల్లో 101 మంది సాక్షులను కోర్టు విచారించింది. నిందితుడిని కోర్టు ఎగ్జామిన్ చేసింది. అత్యాచారం, హత్యలపై ఇరు పక్షాల న్యాయవాదులు జడ్జీ ముందు వాదనలు వినిపించారు. జనవరి 17న తుది వాదనలు ముగిశాయి. నిందితుడికి ఉరే సరని హాజీపూర్ గ్రామస్తులంటున్నారు.

 

Tags:    

Similar News