బీజేపీలోకి మాజీ మంత్రి మోత్కుపల్లి?

Update: 2019-08-11 02:55 GMT

మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. బీజేపీలోకి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్.. మోత్కుపల్లి ఇంటికి వెళ్లిన వీరిద్దరూ దాదాపు గంటపాటు ఆయనతో చర్చించారు. మోత్కుపల్లి కూడా బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీలో ఓ వెలుగు వెలిగిన మోత్కుపల్లి ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో విభేదించి బయటికి వచ్చేశారు. ఆ తరువాత టీఆరెస్ లో చేరతారని అందరూ భావించారు.. కానీ ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో టీడీపీ ఓడిపోవాలని తిరుమలకు పాదయాత్ర కూడా చేశారాయన. 

Tags:    

Similar News