కిమ్స్ ఆసుపత్రిలో జీవన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి అడ్లూరి
అస్వస్థతకు గురై సికింద్రాబాద్లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.
అస్వస్థతకు గురై సికింద్రాబాద్లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. శుక్రవారం ఆసుపత్రికి వెళ్లిన మంత్రి, జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
జీవన్ రెడ్డికి అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. ఆయన సీనియర్ నాయకుడని, ఆయన ఆరోగ్యం విషయంలో ఎటువంటి అలసత్వం వహించకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు. జీవన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని మంత్రి ఆకాంక్షించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న జీవన్ రెడ్డిని కుటుంబ సభ్యులు కిమ్స్లో చేర్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. పరామర్శించిన వారిలో ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు.