BRS పార్టీలో జోరందుకున్న చేరికలు
BRS పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మా నరేందర్, వందకు పైగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లోకి చేరారు.
BRS పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మా నరేందర్, వందకు పైగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లోకి చేరారు. దీంతో హరీశ్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ రైతు, విద్యార్థి, ఉద్యోగ వ్యతిరేక విధానాలు పాటించడం సహించక.. బీఆర్ఎస్లోకి చేరుతున్నందుకు అభినందనలు తెలిపారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలని అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. పరిపాలన గాలికి వదిలి, ప్రతీకార చర్యలకు ప్రభుత్వం దిగుతుందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారని ఎద్దేవా చేశారు.