Hyderabad: హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

Hyderabad: పక్కా సమాచరంతో దాడి చేసిన రాచకొండ పోలీసులు

Update: 2022-04-06 09:58 GMT

హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

Hyderabad: హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్‌లు పెరిగిపోతున్నాయి. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత క్రికెట్ బెట్టింగులు జోరందుకున్నారు. ఇక ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 43 లక్షల రూపాయల నగదు, ఒక కారు, రెండు బైక్‌లు, 9 సెల్ ఫోన్‌లు సీజ్ చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. యానాం నుండి బెట్టింగ్ నడుస్తుందని, తెలంగాణలో నాగరాజు ప్రధాని నిందితుడిగా ఉన్నారని వెల్లడించారు. 2016లో నాగరాజును బెట్టింగ్‌ కేసులో అరెస్ట్ అయినట్లు సీపీ మహేష్ భగవత్ చెప్పారు.

Tags:    

Similar News