కరీంనగర్ టౌన్: నగరంలో కరోనా ఎఫెక్ట్ తో కరీంనగర్ లోని వెంకటేశ్వర థియేటర్ ను థియేటర్ మేనేజర్ మురళి సిబ్బంది మూసి వేస్తున్నారు. పాఠశాలలు కూడా బంద్ కావడంతో, హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు వారి స్వగృహాలకు పయనమయ్యారు. సినిమా హాళ్లు, బార్ అండ్ రెస్టారెంట్ మూసి వేస్తున్నారు. కరీంనగర్ లో కరోనా ఎఫెక్ట్ ప్రభావంతో చికెన్ సెంటర్ లో, మాంసం కొనుగోలుదారులు కూడా కరువయ్యారని నిర్వాహకులు తెలిపారు.