Etela Rajender: కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారు.. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎప్పుడూ ఒక్కటి కావు

Etela Rajender: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారి ఒప్పందం కొనసాగుతోంది

Update: 2023-07-08 07:18 GMT

Etela Rajender: కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారు.. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎప్పుడూ ఒక్కటి కావు

Etela Rajender: ప్రధాని మోడీ రైల్వే వ్యాగన్ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేయడం శుభసూచికమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. కేసీఆర్‌ను గద్దే దించే బాధ్యతను బీజేపీ నిర్వర్తించాలని ప్రజలు కోరుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆరునూరైనా గెలవాల్సింది బీజేపీ మాత్రమే అన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎప్పుడూ ఒక్కటి కావని... కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారి ఒప్పందం కొనసాగుతోందని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.  

Tags:    

Similar News