‌Hyderabad: జెండా సాక్షిగా కొట్టుకున్న టీఆర్ఎస్‌-బీజేపీ నేతలు

ఎమ్మెల్యే మైనంపల్లి తీరును నిరసిస్తూ.. ఇవాళ మల్కాజ్‌గిరి బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ

Update: 2021-08-16 02:38 GMT

మల్కాజ్గిరి లో జెండావిష్కరణ సమయంలో కొట్టుకున్న టీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు (ఫైల్ ఇమేజ్)

‌Hyderabad: నిన్న మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో జెండా సాక్షిగా టీఆర్ఎస్‌-బీజేపీ నేతలు కొట్టుకున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తమ కార్పొరేటర్ శ్రవణ్‌పై దాడికి పాల్పడ్డారన్నారు బీజేపీ నేతలు. కాదు కాదు తమపార్టీ కార్యకర్తలు దాడి చేయలేదంటున్నారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. ఇక ఎమ్మెల్యే తీరును సీరియస్‌గా తీసుకున్న కమలనాథులు.. నేడు మల్కాజ్‌గిరి నియోజవకవర్గంలో బంద్‌కు పిలుపునిచ్చారు. నగరవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా మైనంపల్లి వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News