Harish Rao: కరోనా సమయంలో ఆయుర్వేదమే ప్రపంచానికి భరోసానిచ్చింది

Harish Rao: అంతుచిక్కని మహమ్మారికి సాంప్రదాయ వైద్యమే మందు అయింది

Update: 2023-06-25 08:57 GMT

Harish Rao: కరోనా సమయంలో ఆయుర్వేదమే ప్రపంచానికి భరోసానిచ్చింది

Harish Rao: కరోనా సమయంలో ప్రపంచమంతా తలకిందులైతే, ఆయుర్వేదం ఒక్కటే భరోసాను ఇచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయుర్వేద వైద్యులకు హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లలో సేవలు అందించే ఒక గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. అంతుచిక్కని మహమ్మారికి సంప్రదాయ వైద్యమే మందు అని ఎంతో మంది నమ్మి ఆచరించి ప్రాణాలు కాపాడుకున్నారని వివరించారు. ప్రభుత్వ ఆయుర్వేద ఫార్మసీ ద్వారా తయారు చేసిన జీవన్ ధార అనే ఔషధాన్ని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిందని హరీశ్ రావు గుర్తు చేశారు. 

Tags:    

Similar News