Telangana: స్థానిక ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్
Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.
Telangana: స్థానిక ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. గతంలో విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ను సస్పెండ్ చేసి, కొత్తగా మరో నోటిఫికేషన్ జారీ చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. బీసీ రిజర్వేషన్లు, నోటిఫికేషన్ విధానం వంటి అంశాల్లో న్యాయపరమైన లోపాలు ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, కొత్త పిటిషన్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ పిటిషన్పై హైకోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది.