సీఎం కేసీఆర్ను కలిసిన డీజీపీ అంజనీ కుమార్
సీఎం కేసీఆర్ను కలిసిన డీజీపీ అంజనీ కుమార్
సీఎం కేసీఆర్ను కలిసిన డీజీపీ అంజనీ కుమార్
Anjani Kumar: రాష్ట్ర డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఈరోజు ప్రగతి భవన్ లో అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్ శనివారం మధ్యాహ్నాం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీలు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.