సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు
జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో తెలంగాణ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. పుణెలో జరిగిన 65వ స్కూల్ టెన్నిస్
జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో తెలంగాణ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. పుణెలో జరిగిన 65వ స్కూల్ టెన్నిస్ చాంపియన్ షిప్ పోటీల్లో అండర్-14 జట్టు తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పింది. అండర్-14 టెన్నిస్ పోటీలో వినీత్ ముత్యాల, కలగార ధరణిదత్తా, నిఖిల్ డిసౌజా, ఎం. వివేక్శ్రీఆక్షిత్రెడ్డి, జి.భవ్యానందరెడ్డిలు కాంస్య పతాకాన్ని సాధించారు. ఈ పోటీల్లోని అన్ని విభాగాల్లో ప్రారంభం నుంచి ఈ జట్టు మంచి ప్రతిభ కనబరిచింది. సింగిల్స్ విభాగంలో వినీత్ ముత్యాల బంగారు పతాకాన్ని సాధించడం విశేషం. జాతీయ స్థాయిలో ఈ టెన్నిస్ క్రీడాకారులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించి సత్తా చాటడాన్ని పలువురు అభినందించారు.