Minister Srinivas Goud: ఈ నెల 22న అమరవీరుల సంస్కరణ ర్యాలీ.. 6వేల మంది కళాకారులతో కార్యక్రమం
Minister Srinivas Goud: ర్యాలీలో పాల్గొననున్న జానపద, గిరిజన...
Minister Srinivas Goud: ఈ నెల 22న అమరవీరుల సంస్కరణ ర్యాలీ.. 6వేల మంది కళాకారులతో కార్యక్రమం
Minister Srinivas Goud: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న అమరవీరుల సంస్కరణ ర్యాలీ నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహం నుంచి అమరజ్యోతి వేదిక వరకు 6వేల మంది కళాకారులతో వివిధ కళారూపాలతో ఘనంగా చేపట్టాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్లో నిర్వహిస్తున్న ర్యాలీలో తెలంగాణ కళావైభవాన్ని, తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దశ దిశల చాటాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ ర్యాలీలో జానపద, గిరిజన, దక్కనీ కళాకారులు, శాస్త్రీయ కళాకారులు ర్యాలీలో పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు.