India vs England: సెంచరీలతో రెచ్చిపోయిన జైస్వాల్, గిల్.. ఇంగ్లాండ్‌ని ఉతికారేసిన టీమ్ ఇండియా

India vs England: హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ సెలక్ట్ చేసుకున్న టీమ్ ఇండియా తొలి రోజు ఇంగ్లాండ్ ను ఉతికారేసింది.

Update: 2025-06-21 02:30 GMT

India vs England: సెంచరీలతో రెచ్చిపోయిన జైస్వాల్, గిల్.. ఇంగ్లాండ్‌ని ఉతికారేసిన టీమ్ ఇండియా

India vs England: హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ సెలక్ట్ చేసుకున్న టీమ్ ఇండియా తొలి రోజు ఇంగ్లాండ్ ను ఉతికారేసింది. మొదటి రోజు ఆట అయిపోయేసరికి టీమ్ ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 359 రన్స్ కొట్టింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీ కొట్టి నాటౌట్‌గా ఉన్నాడు. అలాగే వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా నాటౌట్‌గా ఉన్నాడు. వీళ్ళిద్దరూ రెండో రోజు కూడా బ్యాటింగ్ కొనసాగిస్తారు. మొదటి రోజు ఆటలో మన టీమ్ ఇండియా తరపున రెండు సెంచరీలు నమోదయ్యాయి. కెప్టెన్ గిల్ సెంచరీ కొట్టగా, ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా 101 రన్స్ కొట్టి అదరగొట్టారు. కెఎల్ రాహుల్ కూడా 42 రన్స్ కొట్టి టీమ్‌కి హెల్ప్ చేశాడు.

టీమ్ ఇండియాకి అదిరిపోయే స్టార్ట్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. అలా టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. కొత్త ఓపెనింగ్ జోడీ అయిన యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి మొదటి వికెట్‌కి 91 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ఇచ్చారు. కానీ, ఆ సమయంలో 42 రన్స్ కొట్టిన రాహుల్ అవుట్ అవ్వడంతో ఈ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. రాహుల్ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ కేవలం 4 బంతులు ఆడి, ఒక్క రన్ కూడా చేయకుండానే అవుట్ అయ్యాడు. దాంతో లంచ్ టైమ్ అయ్యేసరికి టీమ్ ఇండియా 2 వికెట్లు కోల్పోయి 92 రన్స్ కొట్టింది.

జైస్వాల్ - గిల్ సెంచరీలు..

లంచ్ తర్వాత, యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కి సెంచరీ పార్ట్‌నర్‌షిప్ ఇచ్చి, టీమ్ స్కోర్‌ని 200 రన్స్ దాటించారు. ఈ టైమ్‌లో యశస్వి జైస్వాల్ తన టెస్ట్ కెరీర్‌లో ఐదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ తన ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి మొత్తం 101 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కానీ కెప్టెన్ గిల్ మాత్రం తన బాధ్యతను కొనసాగిస్తూ, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్‌తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను బాగా ఇబ్బంది పెట్టారు.

గిల్-పంత్ అదిరిపోయే పార్ట్‌నర్‌షిప్

గిల్, పంత్ ఇద్దరూ కలిసి మొదటి రోజు ఆట అయిపోయేసరికి నాటౌట్‌గా ఉండి, టీమ్ స్కోర్‌ని 359 రన్స్‌కి తీసుకెళ్లారు. ఈ టైమ్‌లో కెప్టెన్ గిల్ 140 బంతుల్లో 14 ఫోర్లతో తన టెస్ట్ కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇటు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా నాటౌట్‌గా హాఫ్ సెంచరీ కొట్టాడు. దీనితో పంత్ టెస్ట్ క్రికెట్‌లో 3000 రన్స్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కి నాటౌట్‌గా 138 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ఇచ్చింది. కెప్టెన్ గిల్ 127 రన్స్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ 65 రన్స్ కొట్టి రెండో రోజు కూడా బ్యాటింగ్ చేస్తారు.

Tags:    

Similar News