IND vs NZ: రోహిత్ శర్మ, శుభ్మన్ సెంచరీలు.. న్యూజిలాండ్ టార్గెట్ 386..
IND vs NZ: రోహిత్ శర్మ, శుభ్మన్ సెంచరీలు.. న్యూజిలాండ్ టార్గెట్ 386..
IND vs NZ: న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (101), శుభ్మన్ గిల్ (112) సెంచరీల మోత మోగించారు. మూడో వన్డేలో భారత్, కివీస్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 రన్స్ చేసింది. కాగా, 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ను భారత్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నామమాత్రంగా సాగుతున్న ఈ మ్యాచ్లోనూ భారత్ గెలిస్తే.. సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.