West Godavari updates: ఇసుక అక్రమ రవాణా కేసులో సీఐ నాయక్, ఎస్సై గంగాధర్ సస్పెండ్..
పశ్చిమ గోదావరి..
▪️ఇసుక అక్రమ రవాణా కేసు విషయంలో అవినీతికి పాల్పడిన సీఐ నాయక్,ఎస్సై గంగాధర్ పై వేటు పడింది.
▪️ఇటీవల జంగారెడ్డిగూడెంలో విచారణ చేస్తున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను అడ్డుకున్నందుకు, స్టేషన్ లో కంప్యూటర్ డేటాను తొలగించిన విషయంలో ఉన్నతాధికారులు దృష్టి
▪️ఈ నేపథ్యంలోనే జంగారెడ్డిగూడెం సీఐ బి. నాగేశ్వర్ నాయక్, ఎస్.ఐ ఎస్.ఎస్.ఆర్ గంగాధర్ ను ఏలూరు రేంజ్ డి. ఐ.జి శ్రీ కె.వి.మోహన్ రావు సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు.
Seshachalam forest: శేషాచలం అడవులలో వన్యప్రాణుల ను వేటాడుతున్న ఇద్దరి అరెస్ట్..
శేషాచలం అడవులు..
-నాటు తుపాకీ స్వాధీనం
-ఎర్ర చందనం స్మగ్లర్లు కోసం కూంబింగ్ చేస్తున్న టాస్క్ ఫోర్స్ కు అడవి జంతువుల వేటగాళ్ళు
-వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకుని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలింపు
Oommen Chandy Comments: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోయిందనుకుంటా..ఉమెన్ చాంది..
ఉమెన్ చాంది..ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్..
-ప్రజా ప్రతినిధిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఉమెన్ చాంది ని సన్మానించిన ఏపీ కాంగ్రెస్ నేతలు..
-కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లు కు వ్యతిరేకంగా ఏపీ లో నిరసన కార్యక్రమాలు చేపడతాం..
-పార్లమెంట్ లో చర్చ లేకుండా... రాష్ర్టాల అభిప్రాయం తీసుకోకుండా.. రైతులకు నష్టం చేసే బిల్లు ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది...
-ఏపీ కి ప్రత్యేక హోదా ను యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది..టెక్నకల్ గా అన్ని ప్రోసిడర్స్ పూర్తి చేసింది..
-ఉత్తరాఖండ్ కు ఎలా అయితే ప్రత్యేక హోదా ఉందో అలాగే మాకు ఇవ్వమని కోరుతున్నాం..
-ప్రభుత్వాలు మారినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మారవు...
-ఏంధుకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి..
-న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది.. ఆ వ్యవస్థ ను ఎవరు శాసించలేరు..
Sailajanath Comments: బీజేపీ ,జనసేన ,వైసీపీ అన్ని కూడా ఓకేరకమైన పార్టీ లు..శైలజానాథ్..
ఇందిరా భవన్..
-ప్రజా ప్రతినిధిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఉమెన్ చాంది ని సన్మానించిన ఏపీ కాంగ్రెస్ నేతలు..
శైలజానాథ్ ..ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు..
- ఏపీ లో అనేక సమస్యల విషయం లో పార్టీ ఏలాంటి వైఖరి అవలంబించాలనే అంశంపై చర్చించాము..
- దేవాలయాల జరుగుతున్న దాడుల విషయం ప్రధానంగా చర్చించాం..
- ప్రశ్నించేవారి పై ఏపీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.
- అన్ని విషయాలలో భాదితుల పక్షాన నిలబడాలని నిర్ణయించాం..
- ఈ నెల 24 నుంచి నవంబర్ 6 వరకు రైతు ల పక్షాన పోరాడుతాం..
- మూడు రాజధానులకు మేము వ్యతిరేకం..
- అప్పుడు చంద్రబాబు ,ఇప్పుడు జగన్ రాజధాని విషయంలో ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకోకుండా పోవడం వల్లే ఈ సమస్యలు..
Vijayawada-Durgamma updates: రోజుకో మలుపు తిరుగుతున్న దుర్గగుడి వెండి సింహల మాయం ఎపిసోడ్..
విజయవాడ..
- జూన్ 27వరకు వెండి రథానికి ఉన్న వెండి సింహాలు
- వెండి సింహల కేసు దర్యాప్తు వేగవంతం చేసిన 4 పోలీస్ బృందాలు
- బీహార్ కి చెందిన కార్మికులపై అనుమానాలు
- 25మంది పనిచేసిన బీహార్ కు చెందిన కార్మికులు. వారిలో 8మందిని గుర్తించి విచారించిన పోలీసులు
- వెండి వ్యాపారులపై దృష్టి పెట్టిన పోలీస్ లు
Nellore updates: దమ్ము ధైర్యం, ఏమాత్రం నీతి , నిజాయితీలు, నైతిక విలువ ఉంటే ఈ ఎస్ ఐ పై ఏసీబీ దర్యాప్తు ఆదేశించాలి --టిడిపి నేత కోటంరెడ్డి సవాల్..
నెల్లూరు..
-రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈఎస్ఐ కుంభకోణం లో దోషులను తేల్చాలని నెల్లూరు ఏసీబీ డీఎస్పీ కార్యాలయంలో డి.ఎస్.పి దేవానంద్ శాంత్రో కి వినతిపత్రం ఇచ్చి టిడిపి నేతలు
-ఈఎస్ఐ కుంభకోణం లో మంత్రి జయరాం పీకల్లోతు ఇరుక్కున్నారు
-ఆయన కుమారుడు ఈశ్వర్ బెంజ్ కారును బహుమతిగా తీసుకున్నట్లు బయటపడింది
-ఈఎస్ఐ కుంభకోణం లో ఏ 14 గా కార్తీక్ నుంచి బెంజ్ కార్ తీసుకున్న ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది
-వైసీపీ ప్రభుత్వం అవినీతికి పెద్ద పీట వేస్తూ ప్రజల సొమ్మును కొల్లగొడుతోంది
-టిడిపి నేత అచ్చం నాయుడు పై ఈఎస్ఐ కుంభకోణం లో అనవసరంగా ఇరికించి కేసులు నమోదు చేశా రు.
Guntur updates: తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి..యరపతినేని శ్రీనివాసరావు..
గుంటూరు ః
టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు..
-4 వేలకోట్ల కు ఆశపడి విద్యుత్ మీటర్ల తో రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారు.
-రైతుల విషయం లో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
-సంక్షేమ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు.
-సొంత లిక్కర్ పాలసీ తెచ్చి పిచ్చి బ్రాండ్లను ప్రజలకు అంటగట్టారు.
-సొంత మద్యం బ్రాండ్ లతో వేల కోట్లు దోచుకుంటున్నారు.
-భవన నిర్మాణ కార్మికులు 400 కోట్లు ప్రభుత్వం వాడుకోవడం దుర్మార్గం.
-ఏడాది కాలంలో లక్ష కోట్లు తెచ్చిన అప్పు ను ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి.
Sri Padmavathi Ammavaru: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న శ్రీనివాస వేణుగోపాల కృష్ణ..
చిత్తూరు..
- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మాత్యులు చెల్లుబొయినా శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
- శ్రీవారి ఆశీస్సులతోనే సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సుభిక్ష పాలన అందిస్తున్నారు
- మహిళలను ఆర్థికకంగా మరీంత బలోపేతం చేసేందుకు సంక్షేమ పథకాలు ఎంతో దోహదపడుతున్నాయి....
Vizianagaram updates: 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన గరుగుబిల్లి మండలం నాగూరు వీఆర్వో నాగేశ్వరరావు..
విజయనగరం..
-నాగూరుకు చెందిన రైతు అప్పలనాయుడు నుంచి 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో
-1.80సెంట్ల భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాల సబ్ డివిజన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన వీఆర్వో నాగేశ్వరరావు.
Anantapur updates: లౌకిక వాదాన్ని పాటిస్తున్న పార్టీ టీడీపీ: కాలవ శ్రీనివాసులు..
అనంతపురం:
కాలవ శ్రీనివాసులు ప్రెస్మీట్.
-రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
-మెజారిటీ వర్గం మనోభావాలు దెబ్బతింటున్నాయి. హిందూ మతం, దేవలయాలపై దాడులు కొనసాగుతున్నాయి.
-ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదానికి విరుద్ధంగా జరుగుతోంది.
-ఇన్ని జరిగితే జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది చేయడం లేదు
-కొడాలి నాని ఉన్మాదం తో అగ్నికి ఆజ్యం పోసినట్లు మాట్లాడుతున్నాడు. విజయసాయిరెడ్డి చంద్రబాబు ను తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై కేసు పెడతామంటారు.
-టీటీడీ చైర్మన్ జగన్ బంధువు డిక్లరేషన్ అవసరం లేదు అంటాడు. నాని జగన్ మనసులో మాట చెప్పారు.
-టీటీడీ ఈఓ కు డిక్లరేషన్ పై సంతకం చేయించుకోవాల్సిన బాధ్యత ను గుర్తు చేస్తూ లేఖ రాస్తున్నాం. చేయాల్సిన ధర్మం సీఎం పై ఉంది.