West Bengal: మమత రెండో సీటు వెతుక్కుంటున్నారు- మోడీ

West Bengal: మమతా బెనర్జీ పోలింగ్ నాడే ఓటమిని అంగీకరించారంటూ ప్రధాని మోడీ విమర్శించారు.

Update: 2021-04-01 12:32 GMT

West Bengal: మమత రెండో సీటు వెతుక్కుంటున్నారు- మోడీ

West Bengal: మమతా బెనర్జీ పోలింగ్ నాడే ఓటమిని అంగీకరించారంటూ ప్రధాని మోడీ విమర్శించారు. బెంగాల్ లో పలు ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. బెంగాల్ ప్రజలను కూల్ కూల్ అంటూ దీదీ సర్ది చెబుతున్నారని కానీ వాస్తవానికి బెంగాల్ ప్రజల పాలిట టీఎంసీ శూలం లాంటిదని ఎద్దేవా చేశారు. బెంగాల్ కు అన్యాయం చేసే శూలం, రక్తతర్పణం చేసే శూలం తృణమూల్ కాంగ్రెస్సేనని అన్నారు. బెంగాలీ భాషలో మమతపై సెటైర్లు వేస్తూ జనంలో హుషారు నింపారు మోడీ.

ఓటమి భయంతో దీదీ చేతులెత్తేశారని ఇప్పుడు రెండో సీటు కోసం వెతుక్కుంటున్నారని కామెంట్ చేశారు. బెంగాల్ లోని ఉలుబేరియా ప్రచార సభలో మోడీ కామెంట్లకు టీఎంసీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం దీదీ కి రెండో స్థానాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదని నందిగ్రామ్ లో ఆమె గెలుపు ఖాయమనీ రిప్లయ్ ఇచ్చారు.

Tags:    

Similar News