Bharat Ratna: ప్రధాని మోదీ కీలక ప్రకటన.. అద్వానీకి భారతరత్న..!

Bharat Ratna: ప్రధాని మోదీ కీలక ప్రకటన.. అద్వానీకి భారతరత్న..!

Update: 2024-02-03 06:26 GMT

Bharat Ratna: ప్రధాని మోదీ కీలక ప్రకటన.. అద్వానీకి భారతరత్న..!

Bharat Ratna: బీజేపీ అగ్రనేత అద్వానీని భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎల్‌.కే. అద్వానికి భారతరత్న పురస్కారం ఇవ్వబడుతోందనే విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పురస్కారాన్ని పొందిన అద్వానీకి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.

సమకాలీన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అద్వానీ ఒకరని... మన దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు, కృషి చిరస్మరణీయమైనవన్నారు ప్రధాని మోడీ. అట్టడుగు స్థాయిలో పని చేయడం దగ్గర నుంచి... దేశానికి ఉప ప్రధానమంత్రిగా చేయడం వరకు ఆయన జీవితం ఎంతో ఉన్నతమైనదని కొనియాడారు. దేశ హోంమంత్రిగా, సమాచారశాఖ మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎంతో ఆదర్శప్రాయమైనవి, ఎంతో ఆలోచనప్రాయమైనవని మోడీ ట్వీట్ చేశారు. అద్వానీతో దిగిన ఫోటోలను ప్రధాని మోడీ షేర్ చేశారు.


Tags:    

Similar News