దారుణం: భర్త ఇంట్లో ఉండగానే.. అత్త, మామలను కడతేర్చిన కోడలు

Update: 2020-04-24 12:33 GMT
representative image

ఢిల్లీలో దారుణం జ‌రిగింది. ఆస్తి కోసం ఓ మహిళ అత్త‌మామ‌ల‌ను అతి కిరాతకంగా పొడిచి చంపింది. పశ్చిమ ఢిల్లీ చావ్లా ప్రాంతంలోని కవిత (35) అనే మహిళ తన అత్తమామలు రాజ్‌ సింగ్‌(61), ఓంవతి (58)లను దారుణంగా కొట్టి ఆపై కత్తితో పొడిచి చంపిందని పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ దారుణం జ‌రిగిన స‌మ‌యంలో మ‌హిళ‌ భర్త, ఆమె ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.

క‌న్న త‌ల్లిదండ్రుల‌ను భార్య కొట్టి చంపుతున్నా భ‌ర్త సతీష్ సింగ్ అడ్డుకోక‌పోవ‌డంతో పోలీసులు అత‌నిపై కూడా అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఆస్తి విష‌య‌మై గొడ‌వ జ‌రిగిన‌ట్లు త‌మ ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని, త‌దుప‌రి విచార‌ణ కోసం హ‌త్య‌కు పాల్ప‌డిన‌ కవిత మరియు సతీష్ సింగ్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News