Mumbai: పుస్తకాల్లో 90వేల డాలర్ల కరెన్సీ నోట్లు.. పట్టుకున్న కస్టమ్స్
Mumbai: జనవరి 22, 23వ తేదీల్లో వేర్వేరు ఘటనలు.. ప్రయాణికుల నుంచి 2.5 కేజీల బంగారం సీజ్
Mumbai: కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్నా కొంతమంది ప్యాసింజర్లు తీరు మాత్రం మార్చుకోవడంలేదు. తాజాగా ముంబై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు ప్యాసింజెర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 90వేల అమెరికా డాలర్లను సీజ్ చేశారు. అమెరికా డాలర్ల నోట్లను పుస్తకాల్లో తీసుకువస్తున్న ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. జనవరి 22, 23వ తేదీల్లో ఈ ఘటనలు జరిగాయి. ఆ ప్రయాణికులు ఇద్దరూ విదేశీయులే. పుస్తకాల్లో డాలర్ల నోట్లను పట్టుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ప్రయాణికుల నుంచి 2.5 కేజీల బంగారాన్ని కూడా సీజ్ చేశారు. పేస్ట్ రూపంలో వాళ్లు ఆ బంగారాన్ని తీసుకువచ్చారు.