Coronavirus Updates in India: దేశంలో తొలిసారి ఒక్కరోజులో 50 వేలకు పైగా కరోనా కేసులు

Update: 2020-07-30 04:27 GMT
ప్రతీకాత్మక చిత్రం

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 15 లక్షల 83 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 52,123 కేసులు నమోదు కాగా, 775 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 32,553 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 15,83,792 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,28,242 ఉండగా, 10,20,582 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 34,968 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.44శాతంగా ఉంది. కాగా, నిన్నటి వరకు మొత్తం 1,81,90,382 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 4,46,642 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.



Tags:    

Similar News