Coronavirus Updates in India: భారత్‌లో కొత్తగా 48,513 కరోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-07-29 05:18 GMT
Corona updates in Tamil nadu

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 15 లక్షల 31 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 48,513 కేసులు నమోదు కాగా, 768 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 35,286 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 15,31,669 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,09,447 ఉండగా, 9,88,029 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 34,19 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.24శాతానికి చేరగా, మరణాల రేటు 2.25శాతంగా ఉంది. జూలై 28 నాటికి దేశ‌వ్యాప్తంగా 1,77,43,740 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్‌) వెల్ల‌డించింది. నిన్న ఒకేరోజు 4,08,855 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని ప్ర‌క‌టించింది.


Tags:    

Similar News