Coronavirus లైవ్ అప్డేట్స్ : మహారాష్ట్రలో ఒకే కుటుంబంలో 25 మందికి కరోనా పాజిటివ్!
కరోనా సంక్రమణను నివారించడానికి దేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో 7 రోజులుగా మహారాష్ట్రలో కర్ఫ్యూ అమలులో ఉంది. అయినప్పటికీ, నగరాల్లో కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు మరియు మెడికల్ షాపుల వద్ద ప్రజలు అధికంగా ఉన్నారు. అదే సమయంలో, ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో వలసపోతున్నారు. దీంతో రోడ్లపై జనం భారీగా కనిపిస్తున్నారు. పోలీసులు ఎంత వారించినా ప్రజలు ఈ ధోరణి మానడం లేదు. దాంతో కొందరిపై పొలిసులు లాటి ఛార్జ్ చేయవలసి వచ్చింది. దీనిపై సీఎం ఉద్ధవ్ థాకరే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. - పూర్తి కథనం