చంద్రయాన్ 2పై సీఎం జగన్ ట్వీట్

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్టర్ వేదికగా స్పందిచారు. స్పందించారు. మనం దాదాపుగా అక్కడకు చేరుకున్నామన్నారు సీఎం వైఎస్ జగన్. చివరి నిమిషంలో చిన్న వెనుకడుగే.. మన విజయానికి తొలిమెట్టు అవుతుందన్నారు.

Update: 2019-09-07 05:54 GMT

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్టర్ వేదికగా స్పందిచారు. స్పందించారు. మనం దాదాపుగా అక్కడకు చేరుకున్నామన్నారు సీఎం వైఎస్ జగన్. చివరి నిమిషంలో చిన్న వెనుకడుగే.. మన విజయానికి తొలిమెట్టు అవుతుందన్నారు. కాగా.. భారత జాతి మొత్తం ఇస్రో టీం వెంటే ఉందన్నారు జగన్ .ఈ ప్రయోగం కోసం ఎంతగానో శ్రమించిన వారందరికీ అభినందనలు తెలిపారు వైఎస్ జగన్. అంతకముందు చంద్రయాన్-2 కోసం ఇస్రో బృందం అద్భుతమైన పని తీరు కనబరిచారని..అంకిత భావంతో కృషి చేశారని రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ కొనియాడారు.

భవిష్యత్ లో సంపూర్ణ విజయం సాధిస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. జీవితంలో ప్రతి ప్రక్రియలో జయాపజయాలు సాధారణమని..ఇస్రో శాస్త్రవేత్తలు సాధించింది తక్కువేమి కాదని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. చంద్రయన్-2 కోసం ఇస్రో బృందం పడిన కష్టం..నిబద్ధత చూసి దేశం మొత్తం మీ వైపు నిలిచిందని..భవిష్యత్ ప్రయోగాల కోసం బెస్ట్ విషెస్ చెబుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. జీవితంలో ఎత్తు పల్లాలు సహజం.. ధైర్యంగా ఉంటాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ట్వీట్ చేశారు. 



Tags:    

Similar News