ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ గణతంత్ర దినోత్సవం సందర్బంగా వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఎస్టీవీ-269 పేరుతో ఒక ప్యాక్ను లాంచ్ చేసింది. ఈ ప్యాక్లో 2.6 జీబీ డేటా, అలాగే ఏ నెట్వర్క్కు అయినా 2600 నిమిషాల టాక్టైం, 260 మెసేజ్లను అందిస్తోన్న ఈ ప్లాన్ వాలిడిటీ 26 రోజులు.
దేశవ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఈ ప్యాక్ అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అనుపమ శ్రీవాస్తవ మీడియా ప్రకటన జారీ చేశారు. 70వ రిపబ్లిక్ డే సందర్భంగా వినియోగదారులకు శుభాకాంక్షలు అందిస్తూ ఈ ఆఫర్ అని పేర్కొన్నారు.