ఢిల్లీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 792 కొత్త కేసులు

Update: 2020-05-27 09:49 GMT

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 792 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు 310 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,257కి చేరింది. ఈ రోజు డిశ్చార్జి అయిన వారితో కలిపి మొత్తం 7,264 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 303 మంది చనిపోయారు. 7,690 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 6,387 కేసులు నమోదు కాగా, 170 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. మొత్తంగా భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,51,767కు చేరుకోగా, మృతుల సంఖ్య 4,337కు చేరింది. ఈ వైరస్‌ నుంచి 64,425 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్కరోజే దాదాపు 4వేల మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.


Tags:    

Similar News