'ఓ పిట్ట కథ'పై ప్రభాస్ పోస్ట్ వైరల్..
విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్ రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రలలో తెరకెక్కీన చిత్రం ఓ పిట్ట కథ .. ఇప్పటివరకు పెద్ద పెద్ద సినిమాలను నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.
విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్ రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రలలో తెరకెక్కీన చిత్రం ఓ పిట్ట కథ .. ఇప్పటివరకు పెద్ద పెద్ద సినిమాలను నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ద్వారా చందు ముద్దు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సినిమాని మార్చి 06 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాదులో నిర్వహించింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
నటుడు బ్రహ్మాజీ ఇండస్ట్రీలో తనకు ఉన్న పరిచయాలతో 'ఓ పిట్టకథ' చిత్రానికి మంచి హైప్ తీసుకువస్తున్నారు. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఈ మూవీ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బ్రహ్మాజీతో మంచి అనుబంధం ఉన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'ఓ పిట్టకథ' చిత్ర యూనిట్ కి ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా విషెస్ అందించారు. ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్న సంజయ్ కి బెస్ట్ విషెష్.. అలాగే బ్రహ్మాజీకి, భవ్యా క్రియేషన్స్కి టీంకి ఆల్ ది బెస్ట్' అని పేస్ బుక్ లో పోస్ట్ వైరల్ గా మారింది.
చిన్న చిత్రంగా మొదలైన ఈ చిత్రానికి స్టార్స్ మద్దతు లభించడంతో.. వచ్చే శుక్రవారం విడుదలయ్యే చిత్రాల్లో 'ఓ పిట్టకథ'కు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందించాడు.
Darling, Rebel Star #Prabhas wishes #OPittaKatha team All the Best for the release on March 6th.@mynameisVISWANT @SanjayKOfficial @NityaMShetty @actorbrahmaji @ChenduMuddhu #AnandPrasad @BhavyaCreations #AnneRavi #PraveenLakkaraju
— BARaju (@baraju_SuperHit) March 4, 2020
#OPittaKathaOnMarch6th pic.twitter.com/2UlvUXHAWu