కొత్త దర్శకులతో పని చేయడం పై రియాక్ట్ అయిన విజయ్ దేవరకొండ

వరుస విజయాలతో దూసుకుపోతూ విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో హ్యాపెనింగ్ హీరోగా మారిపోయాడు. యూత్ ఐకాన్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ లా కూడా వ్యవహరిస్తున్నాడు.

Update: 2019-01-28 06:30 GMT

వరుస విజయాలతో దూసుకుపోతూ విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో హ్యాపెనింగ్ హీరోగా మారిపోయాడు. యూత్ ఐకాన్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ లా కూడా వ్యవహరిస్తున్నాడు. తాజాగా సిగ్నేచర్ బ్రాండ్ కు అంబాసిడర్ గా మారి బుల్లితెరపై సందడి చేస్తున్నాడు విజయ్. ఈ సందర్భంగా సిగ్నేచర్ మాస్టర్ క్లాస్ సీజన్ 3 అనే కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ తన కరియర్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

కొత్త దర్శకులతో పని చేయడానికి ముందుంటారు కదా అని అడగగా తను కొత్తవారిని ఎంకరేజ్ చేయడం ఏంటి వారిలో ఉన్న అద్భుతమైన టాలెంట్ వల్లనే వారు అలా ఈ స్టేజ్ కి వచ్చారు అన్నాడు విజయ్ దేవరకొండ. మంచి టెక్నీషియన్లు మంచి దర్శకులు తనకు లభించడం తన అదృష్టం అని చెప్పుకొచ్చాడు. 'పెళ్లి చూపులు' చిత్రంతో తరుణ్ భాస్కర్, 'అర్జున్ రెడ్డి' సినిమా తో సందీప్ రెడ్డి ని టాలీవుడ్ కు పరిచయం చేసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత మరో కొత్త దర్శకుడితో ఒక సినిమాను సైన్ చేసినట్లు ప్రకటించాడు.

Similar News