Flight Accident in Kerala: విమాన ప్రమాద ఘటన పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన టాలీవుడ్ హీరోలు

Flight Accident in Kerala: కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్

Update: 2020-08-08 05:31 GMT
Allu Arjun, Mahesh Babu (File Photo)

Flight Accident in Kerala: కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కారిపూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి విమానం ప‌క్కకు జారింది. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలైంది. అయితే ఆ ఘటన పైన పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ హీరోలు కూడా స్పందించారు.

అయితే ఈ ఘటన పైన సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ.. కోజికోడ్ విమాన ప్రమాద ఘటన ఎంత‌గానో కలచి వేసిందని అన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికిని నా సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడివారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టుగా మహేష్ బాబు ట్వీట్ చేశారు.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ.. కోజికోడ్‌లో ఇలాంటివి చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మ‌ర‌ణించిన వారికి నా సంతాపం తెలియ‌జేస్తున్నాను. గాయ‌ప‌డిన వారు త్వర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.


ఇక ఈ ప్రమాదంలో పైలట్‌, కోపైలట్‌ తో సహా 20 మంది దుర్మరణం పాలైనట్లుగా సమాచారం.. దాదాపుగా 120 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో మొత్తం 191 మంది విమానంలో ఉన్నారు. మిగితా వివ‌రాలు తెలియాల్సి ఉంది. కేరళలో భారీ ఎత్తున వర్షం పడుతోంది. దీని వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News